ప్రాచీన భారతదేశ చరిత్ర - 10

1. మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ బారుత్‌ బౌద్ధస్థూపం ఏ వంశ రాజుల కాలంలో నిర్మించారు?

Answer: శుంగ వంశం

 

2. భారతదేశ భూభాగంపై మొదటిసారిగా విదేశీ ఆధిపత్యాన్ని స్థాపించినవారు ఎవరు?

Answer: యవనులు

 

3. పుష్యమిత్ర శుంగుడు బౌద్ధులను అణచివేసినట్లు తెలియజేసిన గ్రంథం ఏది?

Answer: దివ్యవదన

 

4. ఖారవేలుడు ఎవరు నిర్మించిన పురాతన కాలువను పొడిగించాడు?

Answer:మహా పద్మనందుడు

 

5. చంద్రగుప్త మౌర్యుని సామంతరాజు నిర్మించిన సుదర్శన తటాకం ఆనకట్టను రుద్ర దమనుడు బాగు చేయించాడు. ఆ ఆనకట్ట ఎక్కడ కలదు?

Answer: కథియావాడ్‌

 

6. కనిష్కుడు పోషించిన బౌద్ధమత శాఖ ఏది?

Answer: మహాయానం

 

7.మహాభాష్యం దేన్ని వ్యాఖ్యానిస్తుంది?

Answer: పాణిని అష్టాధ్యాయి

 

8. కళింగ ఖారవేలుడు వేయించిన శాసనం ఏది?

Answer: హాథిగుంఫా శాసనం

 

9. పురాణాల్లో ‘దర్శకుడు’గా పేరొందిన మగధ సామ్రాజ్య చక్రవర్తి?

Answer:   నాగదాసకుడు

 

10. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజ వంశాల వరుస క్రమ0

Answer:   హర్యంక-శిశునాగ-నంద-మౌర్య-శుంగ వంశాలు